బిగ్ బాస్ కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించిన నూతన్ నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దళిత యువకుడు శ్రీకాంత్ కి ఆయన శిరోముండనం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై కోపంతో సెల్ ఫోన్ పోయింది, దానికోసం మాట్లాడదాం ఇంటికి రమ్మని చెప్పాడట నూతన్ నాయుడు.
ఇంటికి వచ్చిన శ్రీకాంత్కి నూతన్ నాయుడు గుండు కొట్టించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతన నాయుడు శ్రీకాంత్ని బెదిరించారట. అయితే శ్రీకాంత్ పెందుర్తి పోలీసులని ఆశ్రయిండంతో, ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు .