మహానటి’తో జాతీయ అవార్డుని దక్కించుకున్న నటి కీర్తి సురేశ్.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్దే’ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ ఓటీటీలో విడుదలైంది. ఇదే బాటలో కీర్తి నటించిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదలవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా త్వరలోనే కీర్తిసురేశ్ నిర్మాతగా మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే కీర్తి సురేశ్ ఓ వెబ్ సిరీస్ను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై కీర్తిసురేశ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.