Home / MOVIES / పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్

పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్

బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది.

ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది.

“గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో మూడు మొక్కలను నాటాను. అనంతరం ఈ కార్యక్రమానికి హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్, రవితేజ, కరణ్ శర్మ, సౌరభ్‌ను నామినేట్ చేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌గారికి ధన్యవాదాలు.

ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాన`ని పాయల్ ట్వీట్ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat