Home / SLIDER / పీవీని అవమానించిన కాంగ్రెస్

పీవీని అవమానించిన కాంగ్రెస్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.

కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు ఎందుకు చేయాల్సివచ్చిందో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

పీవీ అంత్యక్రియలను గౌరవంగా నిర్వహించలేకపోయారన్నారు. దీంతో సభలో దుమారం రేగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని భట్టి స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా ఆయన ఇవ్వలేదు. కాగా, పీవీ వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో జన్మించారని, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు పీవీ శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నందునే పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, లేకపోతే పీవీ చరిత్ర మరుగున పడేదన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat