Home / MOVIES / క‌ట్ట‌ప్ప అత‌నే అంటున్న గంగ‌వ్వ‌

క‌ట్ట‌ప్ప అత‌నే అంటున్న గంగ‌వ్వ‌

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన‌ మొద‌టి రోజే త‌గాదాల‌తో, అర్థం ప‌ర్థం లేని చిల్ల‌ర గొడ‌వ‌ల‌తో త‌గ‌వు ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో మొద‌టి రోజునే చాలామంది కంటెస్టెంట్లు బోరుమ‌ని ఏడ్చేశారు. అయితే రెండో రోజు మాత్రం కాస్త గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటూ వినోదాన్ని పంచే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఈసారి కూడా మోనాల్ ఏడుపును ఆప‌డం ఎవ‌రి త‌ర‌ము కాలేదు. అయితే అంద‌రి మ‌నుసుల‌ను తొలిచివేస్తున్న ప్ర‌శ్న‌ “క‌ట్ట‌ప్ప ఎవ‌రు?” ఈ ప్ర‌శ్న‌తోనే నేటి ఎపిసోడ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ స‌రైన‌ స‌మాధానం మాత్రం దొర‌క‌లేదు. ఈ రోజు షో ఎలా సాగిందంటే..

పిచ్చాసుప‌త్రిలాగా చేస్తున్న‌వ్

బిగ్‌బాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన స్కూల్లో క‌రాటే క‌ల్యాణి టీచ‌ర్ పాత్ర‌లో లీన‌మైపోయింది అయితే 50 ఏళ్లుగా గంగ‌వ్వ ఇదే స్కూల్లో ఉంద‌ని టీచ‌ర్ పంచ్ వేస్తే.. జీతం తీసుకుని ఫెయిల్ చేస్తున్న‌వ్ అని అవ్వ రివ‌ర్స్ పంచ్ వేసింది. ఆమె అరుపుల‌తో స్కూలు కాస్తా పిచ్చాసుప‌త్రిలాగా చేస్తున్న‌వ్ అంది. గంగవ్వ మాట‌ల‌తో ఇంట్లో న‌వ్వులు పూశాయి. ఆ త‌ర్వాత‌ ప‌నిలో ప‌నిగా బిగ్‌బాస్ హౌస్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను కూడా కంటెస్టెంట్ల‌కు నేర్పించారు. మ‌రోవైపు రోజు గ‌డుస్తున్నా ఇంకా ప్ర‌త్యేక గ‌దిలోనే ఉన్నారు అరియానా, సోహైల్‌. మ‌ధ్యాహ్నం కావ‌స్తున్నా టిఫిన్‌, లంచ్ ఏదీ పంపించకుండా ప‌స్తులుంచుతున్నందుకు కంటెస్టెంట్ల తీరుపై అరియానాకు కోప‌మొచ్చింది. (చ‌ద‌వండి:బిగ్‌బాస్‌: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ)

“నిన్న ఆహారం పంపించారు. మ‌రి ఇవాళ పంపించాల‌న్న‌ ఆలోచ‌న లేదా?” అని అరియానా ఫోన్ చేసి అడిగింది. కాల్ వ‌స్తుంద‌నుకున్నాం అని అఖిల్ చెప్పగానే మెత్త‌బ‌డిన ఆమె “పొరుగింట్లో ఉన్న మాకోసం ఫుడ్ పంపించాలి క‌దా” అని వ‌య్యారాలు పోతూ అడిగింది. ఇలా స్వీట్‌గా మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ కూర పంపిస్తామ‌ని అఖిల్ చెప్పాడు. ఇలా తిండికోసం మాట్లాడుతుండ‌గా నోయ‌ల్ ఫోన్ అందుకుని ఏంది? మర్యాద‌గా అడిగితే మ‌ర్యాద‌గా పంపుతాం.. కానీ ఏంటిదంతా అంటూ పంపించ‌ట్లేదని చెప్ప‌క‌నే చెప్తూ ఫోన్ క‌ట్ చేశాడు. ఊహించ‌ని ప‌రిణామానికి అరియానా, సోహైల్ బిత్త‌ర మొహాలు వేసుకున్నారు.

అఖిలే క‌ట్ట‌ప్ప: గంగ‌వ్వ

ఇక క‌ట్ట‌ప్ప ఎవ‌రా అని బుర్ర‌లు బ‌ద్ధ‌లు చేసుకుంటున్న కంటెస్టెంట్ల‌కు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. మీ మ‌న‌సులో ఎవ‌రిని క‌ట్ట‌ప్పగా అనుకుంటున్నారో వారి పేర్ల‌ను రాసి ఓ డ‌బ్బాలో వేయ‌మ‌న్నాడు. అప్పుడు క‌రాటే క‌ల్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్, సూర్య కిర‌ణ్, సుజాత‌, గంగ‌వ్వ.. అఖిల్ పేరును, దేవి నాగ‌వ‌ల్లి, అఖిల్.. నోయ‌ల్‌, హారిక, లాస్య‌,‌.. సూర్య కిర‌ణ్‌, దివి, మెహ‌బూబ్‌.. లాస్య‌, అభిజిత్, మోనాల్‌‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, నోయ‌ల్‌.. మెహ‌బూబ్ పేర్ల‌ను రాశారు. ఇక‌ అఖిలే క‌ట్ట‌ప్ప అవుతాడ‌ని గంగ‌వ్వ ముఖం ప‌ట్టుకుని చెప్పేసింది. అంద‌రం అఖిల్‌ పేరే రాసిన‌మ‌ని అత‌నితోనే చెప్పుకొచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat