త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్కు క్రమంతప్పకుండా నిధులను ఇస్తున్నదని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు ఆస్తిపన్ను, నీటి పన్ను పెంచలేదని, పైగా పన్నులు తగ్గించామని చెప్పారు.
జీహెచ్ఎంసీలో ఎస్ఆర్డీపీ ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టమన్నారు. లాక్డౌన్ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. అక్టోబర్ 2 వరకు 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు.