దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు 80 వేలకుపైగా నమోదవుతూ ఉన్నాయి. ఈరోజుకూడా 86 వేల మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసులు 58 లక్షల మార్కును దాటాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571కు చేరింది. ఇందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉండగా, మరో 47,56,165 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా వైరస్ కారణంగా తాజాగా 1,141 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతులు 92,290 దాటారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
అదేవిధంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,80,000ల కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంతపెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారని తెలిపింది.