టాలీవుడ్ హాట్ బ్యూటీ మిల్క్ భామ తమన్నాకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నగరంలోని వారం రోజులుగా హైటెక్ సిటీ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గోంటున్నారు.
గత రెండు రోజులుగా తీవ్రమైన తలనొప్పి,జ్వరంతో బాధపడుతున్న ఈ మిల్క్ బ్యూటీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఈ అమ్మడుకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే గతంలో తమన్నా తల్లిదండ్రులు కరోనాకు గురై కోలుకున్న సంగతి విదితమే.