Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యే కి బాబు రూ.50కోట్లు ఆఫర్

వైసీపీ ఎమ్మెల్యే కి బాబు రూ.50కోట్లు ఆఫర్

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత, చంద్రబాబుపై ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికల తర్వాత తనను వైసీపీని వీడి టీడీపీలోకి రమ్మని చంద్రబాబు ఎరవేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎంత డబ్బులు ఇస్తామన్నారు..? ఏం పదవి ఇస్తామన్నారు..? అనే విషయాలపై కూడా మంత్రి మాట్లాడారు.

గత కొన్ని రోజులుగా మంత్రి జయరాం.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఇవాళ అయ్యన్న మీడియా మీట్ పెట్టి పలు ఆరోపణలు చేయగా వాటికి జయరాం స్పందించి తిప్పికొట్టారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు తనను పార్టీ మారమన్నారనే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు.

నాపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు సరే.. 2 ఎకరాల చంద్రబాబు ఇప్పుడు ఇలా ఎలా ఎదిగారో అయ్యన్నపాత్రుడు అడగాలి. ఒక బీసీ మంత్రిని ఇలా అనగదొక్కాలని చూస్తున్నారు. ఆ రోజు 50 కోట్లు ఇస్తాను.. డబ్బులతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు నాకు ఎరవేశారు. అచెన్ననాయుడి లాగా నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు కొన్ని డిస్పెన్సరీలను చెక్ చేశాను.

వాటిలో మెడిసిన్స్ లేవని తేలింది. బాకీలు మాత్రం కట్టాల్సి వచ్చింది. విచారణకు అదేశించాను. వాస్తవాలు బయటకు వచ్చాయి. గతంలో ధనిక బీసీ మంత్రిగా అయ్యన్నపాత్రుడు ఉన్నారు. నేను సాధారణ బీసీ మంత్రిని.. ఇలానే అవాస్తవాలు మాట్లాడితే బీసీల సత్తా ఏమిటో చూపిస్తా అని అన్నార.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat