Home / SLIDER / ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై 29 వ డివిజన్ సుజిత్ నగర్ కు సంబందించిన వివిద పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు..వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. సుజిత్ నగర్ లో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేసారు..అనంతరం పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహణ కల్పించారు..ప్రతీ ఇంటికి తిరుగుతూ పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకోవలసిందిగా సూచించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే అన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కే.టీ.ఆర్ గార్లు ఈ నియోజకవర్గ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని,నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందుంచుతానన్నారు..

నియోజకవర్గ అభివృద్ది,పేదల అభ్యున్నతే ద్యేయంగా ముందుకు వెలుతున్నానని,అందుకు ఆకర్శితులై వివిద పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారన్నారు..పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని,రాబోవు పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని ఎమ్మెల్యే అన్నారు..ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కావేటి కవిత రాజుయాదవ్,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat