Home / SLIDER / దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం

దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం

‘‘మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా ఏనాడైనా దుబ్బాక రైతాంగం గురించి మాట్లాడారా? తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్న ప్రజలను జైల్లో వేస్తే ఎప్పుడైనా విడిపించారా? దుబ్బాకలో ఎన్నో కేసులు నమోదైతే వచ్చి వారి పక్షాన నిలబడ్డారా? మంచిచెడుకు నిలబడేదే మేము.. దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో నిలబడ్డాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..! మీరొచ్చి ఎవరి తలపుండు కడుగుతారో సమాధానం చెప్పాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఇక్కడ చదువుకున్న బిడ్డగా సీఎం కేసీఆర్‌కు ఉన్న  దుబ్బాక మీద తాపత్రయం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికో? దామోదర రాజనర్సింహకో ఉంటుందా అని ప్రశ్నించారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో పలువురు ఎంపీటీసీలు టీఆర్‌ఎ్‌సలో చేరారు.

మంత్రి హరీశ్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దుబ్బాకలో గుడిసెలు ఉండకూడదని దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి 2,500 ఇళ్లను కట్టించారని పేర్కొన్నారు. ఆ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలోకి పేదలు వెళ్లేలోపే ఆయన మరణించారని, ఇది తీరని లోటని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat