జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని చవిచూసిన గంగవ్వ గుండెని రాయి చేసుకొని కాలం గడుపుతుంది . 5 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న గంగవ్వను తాగుబోతు భర్త వదిలి వెళ్లిపోయాడు. రోజు తాగొచ్చి ఆమెను కొట్టడం, మస్కట్కి పోతా డబ్బులు తీసుకురా అని వేధించడంతో ఆమె చాలా విసిగిపోయిందట. 17 ఏళ్ళకే ఆమెకు కొడుకు పుట్టడం, మరో రెండేళ్ళకే కూతురు పుట్టడంతో కష్టాలు మరింత పెరిగాయని గంగవ్వ చెప్పుకొచ్చింది.
నా భర్త నన్ను వదిలి మస్కట్ పోతే కొంత బాధ అనిపించింది, మరోవైపు ఆయన పోయనందుకు తన్నుల బాధతప్పిందని ఆనందం కూడా వేసింది. నా భర్త మస్కట్ పోయిన సమయంలో నా బిడ్డకు ఫిట్స్ వచ్చాయి. ఆమెను ఎత్తుకొని సర్కారు దవాఖానకు తీసుకెళ్ళా. ఊర్లోకి బస్సు రాకపోవడంతో కొంత దూరం వెళ్ళాక ఓ బండి మీద జగిత్యాల ఆసుపత్రికి వెళ్లాను. తీరా ఆసుపత్రికి వెళ్ళాక డాక్టర్ చనిపోయిందని చెప్పారు. దీంతో చేసేదేం లేక బిడ్డను ఎత్తుకొని తిరుగు ప్రయాణం అయ్యాను అని గంగవ్వ చెప్పుకొచ్చింది.
చనిపోయిన బిడ్డతో బస్సులో ఎక్కబోతే వాళ్ళు ఎక్కనివ్వలేదు. ఆటోలో ఇంటకి తీసుకొచ్చాను. అప్పటి నుండి అన్నం కూడా సరిగా లోపలికి పోతలేదు అంటూ గంగవ్వ ఉద్వేగానికి లోనైంది. దీంతో అవినాష్, అఖిల్, సోహైల్, నోయల్.. అవ్వని ఓదార్చే ప్రయత్నం చేశారు. నువ్వు ధైర్యంగా ఉండని చెప్పారు.