ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ సభ్యులు,మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బ్రెయిన్ స్ట్రోక్ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో పిల్లి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విషయం తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.