నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య మంత్రి కేసీఆర్ గారు నిత్యం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. కనుక యువత ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని టీఆరెఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలనీ సూచించారు.
పట్టభద్రులైన యువతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు. డివిజన్ పరిధిలోని గ్రామాలు, కాలనీల వారీగా పట్టభద్రుల జాబితా రూపొందించుకొని వారందరితో ఓటు నమోదు చేయించాలని తెలిపారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజు నాయక్, డివిజన్ ప్రెసిడెంట్ భూపాల్ గౌడ్, ఇల్లందుల సుదర్శన్, మణింద్ర నాథ్, సాంబయ్య నాయక్, కళ్యాణ్ నాయక్, అరుణ్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.