Home / SLIDER / క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది

క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది

క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు.

క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం గండిపేట సమీపాన కోకాపేటలో రెండెకరాల స్థలాన్ని,10కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే.

నమూనాను పరిశీలించిన మంత్రి అందులో పలు మార్పులు చేర్పులను సూచించారు.ఈ సందర్భంగా ఈశ్వర్ గారు మాట్లాడుతూ, సుమారు 43,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంతో సౌకర్యవంతంగా నిర్మించనున్నట్లు చెప్పారు.

దీని నిర్మాణ పనులను వీలైనంత తొందరగా మొదలు పెడదామన్నారు.ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు షానవాజ్ ఖాసీం,కాంతివెస్లీ తదితరులు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat