నవంబర్ మూడో తారీఖున జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసే అంశంపై ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. పవన్ ప్రచారానికి వస్తే, తమకు మరింత అనుకూలిస్తుందని దుబ్బాక సెగ్మెంటు బీజేపీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పవన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతుండడంతో అక్కడకు పవన్ ప్రచారం చేయడంపై త్వరలోనే స్పష్టత రానుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.