ప్రముఖ వ్యాపారవేత్త ప్రతిమా గ్రూప్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు TV5 ని కొనబోతున్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధాలేనని తేలిపోయింది. ఇది వట్టి ఫేక్ న్యూస్ అని రుజువయ్యింది.
హాస్పిటల్, విద్య, ఇన్ఫ్రా రంగాల్లో ఉన్న ప్రతిమా గ్రూప్ TV5ని కొనుగోలు చేస్తుందని మీడియాలో కొందరు వదంతులు సృష్టించారు.
ఇది కొందరు స్వార్ధశక్తులు తెలివిగా అసలు విషయాలను దారి మళ్ళించడానికి.. ఇలాంటి ఫేక్ న్యూస్ ని సృష్టించారని.. దీనిలో నిజం లేదని తేలిపోయింది.
అసలు ప్రతిమా సంస్థలకు ఇలాంటి ఆలోచనే లేదని.. మీడియా రంగంలోకి ప్రవేశించే ఉద్దేశం కూడా లేదని పక్కాగా తెలిసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని.. TV5తో సంబంధం లేదని స్పష్టం చేసింది.