దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింట్ ఈ రోజు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు.
తొలి రౌండ్లో బీజేపీ 341, రెండవ రౌండ్లో 279, మూడో రౌండ్లో 750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. సుజాత ముందంజలో ఉంటారని అందరూ భావించినప్పటికీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.దుబ్బాక మూడో రౌండ్ 1885 లీడ్ లో బీజేపీ.