Home / MOVIES / గ్రీన్‌ చాలెంజ్‌ లో అందాల భామలు

గ్రీన్‌ చాలెంజ్‌ లో అందాల భామలు

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు.   మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు.

గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాల్గొన్నది. హీరో  నాగచైతన్య చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలను నాటాలని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పిలుపునిచ్చింది. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేర్కొన్నది. మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ముందుకు తీసుకుపోతున్నారని రకుల్‌ప్రీత్‌సింగ్‌ కొనియాడింది.

పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసిన గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో స్వచ్ఛందంగా భాగమైంది కథానాయిక నభానటేష్‌. బుధవారం బెంగళూరులోని తన నివాసంలో మొక్కలను నాటింది. పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ఎంపీ సంతోష్‌కుమార్‌ మొదలుపెట్టిన మంచి కార్యక్రమమిదని నభానటేష్‌ తెలిపింది. గ్రీన్‌చాలెంజ్‌ తనలో స్ఫూర్తిని కలిగించిందని చెప్పింది.  ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకువెళ్లాలనే బాధ్యతతో తాను మొక్కలను నాటినట్లు పేర్కొన్నది. ఈ గ్రీన్‌ఇండియా చాలెంజ్‌కు అను ఇమ్మాన్యుయేల్‌, నిధి అగర్వాల్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లను  నామినేట్‌ చేసింది నభానటేష్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat