బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికల్లో ఒకరిగా అలియాభట్ గుర్తింపు తెచ్చుకుంది. ఏ పాత్రలోనైనా సహజమైన అభినయాన్ని కనబరుస్తుందనే పేరు తెచ్చుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆమె రామ్చరణ్ సరసన సీత పాత్రలో నటించబోతున్నది. తొలుత ఆమెపై ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రంలో తొలితరం స్వా తంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో రామ్చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.