Home / Uncategorized / వరద సాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లొద్దు : GHMC కమిషనర్

వరద సాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లొద్దు : GHMC కమిషనర్

వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు.

బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం మళ్లీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు 8 గంటల నుంచే మీ సేవకు ప్రజలు తరలివస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6.64 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.664 కోట్లు అందజేసింది. మరికొంత మంది దరఖాస్తు చేసుకోగా.. మరో 3.31 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat