వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించిన అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, నాగార్జున, తారక్ ఉన్నారు. వీరిలో తారక్ నేటి తరానికి చెందిన స్టార్ హీరో. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ మొదటి సీజన్కు వ్యాఖ్యాతగా తారక్ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం.
ఇప్పుడు ఆ పాత్రను నాగార్జున సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు యంగ్ టైగర్ మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. అయితే బిగ్బాస్ షోకు కాదు.
మరింతకు తారక్ హోస్ట్ చేయనున్న ప్రోగాం ఏంటనే వివరాల్లోకెళ్తే.. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీ సంస్థ మీలో ఎవరు కోటీశ్వరుడు స్టైల్లో స్పెషల్ ప్రోగామ్ను డిజైన్ చేసిందట. దీన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్తలపై తారక్ క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి