అజయ్, శ్రద్ధాదాస్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్థం’. మణికాంత్ తెల్లగూటి దర్శకుడు. రాధికా శ్రీనివాస్ నిర్మాత. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది.
ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుంది. హైదరాబాద్, చెన్నైలలో రెండు షెడ్యూల్స్ను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. ఎడిటర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా ప్రతిభను చాటుకున్న మణికాంత్ సరికొత్త పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’ అని తెలిపారు.
‘మహిళా సాధికారతను చాటిచెప్పే చిత్రమిది. కుటుంబ బంధాలకు వినోదం, సస్పెన్స్ జోడించి రూపొందిస్తున్నాం’ అని దర్శకుడు పేర్కొన్నారు. మహేంద్ర, సాహితీ అవంచ, దేవిప్రసాద్, సాయిదీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని, సంగీతం: సన్నీ ఆస్టిన్.