కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది.
మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం.
బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా లావణ్య త్రిపాఠి పాత్ర గుర్తుండిపోతాయి. అన్ని వార్గాల్ని ఆకట్టుకునే రీతిన కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు’’ అని తెలిపారు.