సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ కూతురు మనస్విని నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాలో ఫ్రీ మెడిసిన్ సీటు లభించింది. ఆదివారం కౌన్సిలర్, తన కూతురుతో కలిసి సిద్దిపేటలోని మంత్రి నివాసంలో హరీశ్ రావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్ తినిపించి, అభినందనలు తెలియజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన ప్రాంతం నుంచి కూడా మెడికల్ రంగం వైపు విద్యార్థులు వెళ్తున్నారని ఇది శుభ పరిణామమన్నారు. మనస్విని ఎంబీబీస్ ని పూర్తి చేసి సిద్దిపేట ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అనంతరం కౌన్సిలర్ కూతురు మనస్విని మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు, మా తల్లిదండ్రుల కృషితో ఈ సీటు సాధించానని, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా మంత్రి సూచన మేరకు సిద్దిపేట ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని మాట ఇచ్చారు.