Home / CRIME / ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు.

తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కంట్రోల్‌ కాకపోవడం ట్యాంకర్‌ డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. వారు సెంట్రల్‌ లాక్‌ కావడంతో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కారు మొత్తం మంటలు వ్యాపించి ఐదుగురు కారులోనే దహనమయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat