ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 354 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టివరకు 8,80,430 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,69,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 3,861 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఇన్ఫెక్షన్ కారణంగా 7,091 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,409 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 1,15,31,206 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.