పవర్స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా `వకీల్ సాబ్` సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు.
దీనితోపాటే `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ షూటింగ్లో కూడా పాల్గొంటారట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రీ మూవీస్కు ఓ సినిమా చేయాలి.
ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్ను కలిశారు. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఈ సినిమాలో పవన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారట. వేసవి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తానని పవన్ మాటిచ్చినట్టు తెలుస్తోంది. 2022 వేసవి టార్గెట్గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.