తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఓ రైతు.. పంట పొలంలో దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నాల ప్లెక్సీలు పెట్టడం వైరల్ గా మారింది. రైతు చంద్రమౌళి 2ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు.
ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. ఆలోచించి పొలంలో దిష్టిబొమ్మలకు బదులు తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను పెట్టేశాడు. హీరోయిన్స్ ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ పంటపై పడదనేది చంద్రమౌళి ఆలోచన.