తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ లో నాగ చైతన్య-సమంత ఒకరు అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆన్స్క్రీన్ కాని ఆఫ్ స్క్రీన్ కాని ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తారు.
ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించిన సమంత-చైతూలు త్వరలో నందిని రెడ్డి తెరకెక్కించనున్న చిత్రంలోను కలిసి కనిపించనున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు థ్యాంక్యూ సినిమాలోను చైతూ సరసన సమంతని తీసుకోవాలని మేకర్స్ భావించగా అందుకు చైతూ నిరాకరించాడట.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థ్యాంక్యూ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్లోని రామకృష్ణ సినిమా హాల్లో జరుగుతుంది. చిత్ర కథను బట్టి ముగ్గురు హీరోయిన్స్ ఇందులో నటించే అవకాశం ఉండగా, అందులో ఒక హీరోయిన్గా సమంతను తీసుకోవాలని అనుకున్నాడట విక్రమ్.
దానికి చైతూ నో చెప్పినట్టు తెలుస్తుంది. ఎక్కువగా ఇద్దరం కలిసి సినిమాలు చేసిన ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. సమంత కాకుండా వేరే హీరోయిన్ని చూడండి అని దర్శకుడికి చెప్పాడంట చైతూ. హాకీ ప్లేయర్గా చైతూ కనిపించనున్నట్టు తెలుస్తుండగా, ఈ సినిమాని సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.