Home / HYDERBAAD / గ్రేటర్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

గ్రేటర్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ యూసుఫ్‌గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ మేరకు హామీని అమలుకు చేయాలని ఆదేశించడంతో ఈ నెల 11న మంత్రి కేటీఆర్‌ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసింది. ఇన్నాళ్లు నీటి బిల్లులు చెల్లిస్తున్న నగర ప్రజలకు ఈ పథకం అమలుతో ఊరట లభించనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat