తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు హామీని అమలుకు చేయాలని ఆదేశించడంతో ఈ నెల 11న మంత్రి కేటీఆర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసింది. ఇన్నాళ్లు నీటి బిల్లులు చెల్లిస్తున్న నగర ప్రజలకు ఈ పథకం అమలుతో ఊరట లభించనుంది.