బుల్లితెరకు గ్లామర్ అందించిన అందాల యాంకర్ అనసూయ. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే అడపాదడపా వెండితెరపై కూడా సందడి చేస్తుంది. ప్రస్తుతం జబర్ధస్త్ అనే షోతో పాటు సంక్రాంతికి సంబంధించి స్పెషల్ షోస్ చేస్తున్న అనసూయ.. కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రం కూడా చేస్తుంది. ఇందులో అనసూయ రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట. మరోవైపు నిహారికతో కలిసి వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది.
ఇటీవల టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తమన్నా,రకుల్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ వంటి సెలబ్రిటీలు కరోనా బారిన పడగా, తాజాగా అనసూయకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఓ కార్యక్రమం కోసం కర్నూలు వెళదామని ఉదయాన్నే లేచాను.
నాలో కరోనా లక్షణాలు కనిపించాయి.దీంతో నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వరగా టెస్ట్ చేయించుకుంటాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వాళ్లు కూడా ఓ సారి టెస్ట్ చేయించుకోండి. నా రిపోర్ట్ ఏంటనేది మీకు తెలియజేస్తాను. అందరు జాగ్రత్త అని అనసూయ తన ట్వీట్లో పేర్కొంది.