గాజుల రామారం డివిజన్ బేకారి గడ్డలో మంచి నీటి సరఫరా కూలాయి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ పాల్గోన్నారు..గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు.
ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని బేకారి గడ్డలో మంచి నీటి సరఫరా కూలాయిని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి ఇంటికి మంచి నీరు అందించడమే ద్వేయంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి కాలనీలో మంచి నీరు అందించడం జరుగుతుంది అని,గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో నీళ్ల కోసం కాలి బిందల ప్రదర్శన చేసిన విషయాన్నీ గుర్తు చేస్తూ తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారానికి రెండు రోజులు మంచి నీరు అందించడం జరుగుతుంది అని తెలిపారు.
రానున్న రోజుల్లో రోజు విడిచి రోజు నీరు అందించడం తమ లక్ష్యం అని,రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, వాటర్ వర్క్స్ అధికారులు జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,DGM అప్పల నాయుడు,మేనేజర్ శివ, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి,వర్డ్ సభ్యులు సింగారం మల్లేష్, నాయకులు,రావుల పృద్వి, శ్రీనివాస్ యాదవ్, దిలీప్, తిరుపతి యాదవ్ కాలని వాసులు, సతీష్, మౌలానా,ఖలీమ్ పాషా, ఆఫ్జాల్, తదితరులు పాల్గొన్నారు.