తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీ, ఆదాయం లేని రైల్వేస్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 29 స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో నవాడ్గి, అంక్షాపూర్, మారుగుట్టి, పోడూరు, మామిడిపల్లి, కట్టాలి, కట్లకుంట మేడిపల్లి, మైలారం, మహాగనాన్, కొత్తపల్లి హావేలి, చిట్టహాల్ట్, నందగాన్ హాల్లి, గేట్ కారేపల్లి, నూకనపల్లిమల్యాల్, నగేశ్వాడి హాల్ట్, మృట్టి హాల్ట్, వలివేడు, రెడ్డిపల్లి, మల్లప్ప హాల్ట్, లింగంగుంట్ల హాల్ట్, గూడిపూడి, గుడిమెట్ట హాల్ట్, మదనపాడు , పింప్లాచౌరి, వల్లూరు, శంకాపూర్, శక్కర్నగర్, యడపల్లి, చిక్నా స్టేషన్లను మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి డోకూర్, పీజేపీరోడ్ హాల్ట్ స్టేషన్లను మూసివేయనున్నారు.