తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శవంతమని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, నల్లబెల్లి, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేట గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని, రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని తెలిపారు.
సుమారు 300 మంది రైతులు సమావేశం జరుపుకునే విధంగా రైతు వేదికల నిర్మాణం జరిగిందని తెలిపారు. కేసీఆర్ లక్ష్యానికి అనుగునంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు నీటి వసతి, 24 గంటల విద్యుత్, రైతు బందు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటోందని తెలిపారు.
రైతులు కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. గత పాలకులు రైతుల క్షేమాన్ని విస్మరించారని, అవినీతి లేకుండా పారదర్శకమైన పాలనను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలోడీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, ఎంపిపి అన్నమనేని అప్పారావు, జడ్పిటీసి మార్గం బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ, మండల రైతు బందు సమితి కో ఆర్డినేటర్ అల్లమనేని మోహన్ రావు, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేష్ కన్నా, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్స్, మండల ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.