బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం గోవాలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్స్ యాంకర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు పలువురు స్నేహితులతో కలిసి గోవాలోని కోలా బీచ్లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వీడియోలు, ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి . యాంకర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో విష్ణు ప్రియ అందాల ప్రకృతిని చూస్తుంటే తకిట తదిమి తందానా అని అనిపిస్తుంది అని చెబుతుండగా, దానికి శ్రీముఖి హృదయ లయల థిల్లానా అని శృతి కలిపింది. అందమైన ప్రకృతిని వీరిద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టు తాజా పోస్ట్లని చూస్తుంటే అర్ధమవుతుంది.
కాగా, బుల్లితెరపై అలరిస్తున్న శ్రీముఖి ఇప్పుడు ‘క్రేజీ అంకుల్స్’ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీముఖితో పాటు సింగర్ మనో, భరణి, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు.