అనుష్క ప్రధాన పాత్రలో శనివారం ఓ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి మరో ప్రధాన పాత్రధారి.
వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అనుష్కతో ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దీనికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేశ్ దర్శకుడు. అయితే, నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించలేదు. త్వరలో చెబుతారేమో! ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. మరో రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట.