ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా కరోనా బారీన పడి 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా నుంచి కోలుకున్న 11,805 మంది నిన్న డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,25,710 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,06,33,025.
మరణాల సంఖ్య 1,55,813కు చేరగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,872. ఇక ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 87,20,822కు చేరింది.