ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన యాంకర్ మంజూష ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంది అనుకుంట. శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి స్టార్ యాంకర్స్ తాకిడి తట్టుకోవాలంటే కాస్త గ్లామర్ షో చేయక తప్పదని భావించిందో ఏమో హాట్ హాట్గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది.
పొట్టి దుస్తులలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మంజూష స్టైలిష్గా ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి. ఈ ఫొటోలను చూసి ఆమె అభిమానులు మంత్రముగ్దులవుతున్నారు.
కాగా, మంజూష .. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రాఖీ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.