ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, మెట్టుగూడ కార్పొరేటర్ సునీత, హెచ్ యు జె అధ్యక్షుడు ఈ చంద్రశేఖర్, టిఆర్ఎస్ యువ నాయకులు తీగుళ్ల కిషోర్ గౌడ్, తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, ధరమ్ రాజ్ చౌదరి, కంది నారాయణ, సుంకు రామచందర్, అనిల్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు గోపాల్ కృష్ణ, వెంకటేష్, రాములు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.