ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ శతకం బాదాడు.