తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జిల్లాల వారీగా వైఎస్ అభిమానులు ఇతర నేతలతో భేటీ అయిన షర్మిల ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు.
ఏప్రిల్ 9న ఖమ్మంలో మెదటి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ముఖ్యనేతలు ఖమ్మంలోని మైదానాలను పరిశీలించారు. రాజన్న రాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే గుండెలన్నింటినీ షర్మిల ఏకతాటిపైకి తెస్తారని పేర్కొన్నారు