Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 278 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 278 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1662 మంది మృతిచెందారు. ఇంకా 2265 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇందులో 830 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని, మృతుల శాతం 0.55గా ఉన్నదని ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 94,19,677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 59,905 నమూనాలను పరీక్షించామని తెలిపింది. కాగా, తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్నటివరకు 6,13,625 మంది టీకా మొదటి డోసు తీసుకోగా, 2,29,539 మంది రెండో డోసు తీసుకున్నారని పేర్కొంది. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat