తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 66వ అభ్యర్థి (జయసారథి) ఎలిమినేషన్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. 25,528 ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇప్పటివరకు 66 మంది ఎలిమినేషన్, ఓట్ల బదలాయింపు అనంతరం ఓట్ల వారీగా…
పల్లా రాజేశ్వర్ రెడ్డి – 6,546
మల్లన్న – 8,568
కోదండరాం- 9,038
తొలి ప్రాధాన్యం + రెండో ప్రాధాన్యంతో కలిపి…
పల్లా – 1,10,840 + 6,546 = 1,17,386
మల్లన్న – 83,290 + 8,568 = 91,858
కోదండరాం – 70,072 + 9,038 = 79,110