ఎక్కడైన ఏదైన కుటుంబానికి చెందిన పెద్దవ్యక్తి డ్యూటీలో ఉండగానే లేదా సర్వీస్ లో ఉండగానే ఆ వ్యక్తికి చెందిన కుమార్తెలు కూడా ఆ ఉద్యోగానికి సంబంధించి కారుణ్య నియామాకానికి అర్హులే అని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉండగానే మరణించాడు.
అతని భార్య అయిన స్వరూపకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమిచ్చారు. అయితే కొద్ది కాలం తర్వాత స్వరూప కూడా సర్వీస్ లో ఉండగానే మరణించింది. దీంతో ఆమె కుమార్తెఅయిన బండారి దివ్య కారుణ్య నియామాకానికి చేసుకున్న దరఖాస్తును జిల్లా జడ్జి తిరస్కరించారు.
దీంతో దివ్య అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనంఈ ఆదేశాలను ఇచ్చింది. దీంతో జిల్లా జడ్జి ఉత్తర్వులను రద్ధు చేస్తూ నిన్న బుధవారం ఆదేశాలను జారీ చేసింది. అంతే కాకుండా పిటిషనర్ కారుణ్య నియామక దరఖాస్తును నాలుగువారాల్లో చట్టప్రకారం పరిష్కరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి,జస్టీస్ బి విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.