తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న సీనియర్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గెలుపు పై మాజీ మంత్రి,భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంబర్ పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ” నాజీవితం కాంగ్రెస్ పార్టీకే అంకితం.
నేను నా ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే ఉంటానని ఉద్ఘాటించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ముప్పై నుండి యాబై వేల మెజార్టీతో గెలుపొందుతారని” ఆయన జోస్యం చెప్పారు.
యూత్ కాంగ్రెస్ లీడర్ గా ..నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ..ఎంపీగా పని చేసిన అనుభవం ఉన్న ,పార్టీలో సీనియర్ నాయకుడిగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనకే పీసీసీ పదవీ ఇవ్వాలని మరోసారి ఆయన మీడియా సాక్షిగా అన్నారు.