పవర్స్టార్ పవన్కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ `వకీల్సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్, దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా సూపర్హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి ఎలాంటి సినిమా ఉండాలని ఆయన అభిమానులు భావించారో అలాంటి సినిమాగా `వకీల్సాబ్` ప్రేక్షకాభిమానుల ఆదరణను దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఆ మధ్యన ఏప్రిల్ చివరి వారంలో `వకీల్సాబ్` ఓటీటీ రిలీజ్ ఉంటుందని వార్తలు గట్టిగా వినిపించినా దిల్రాజు వాటిని ఖండించాడు. సినిమా రిలీజైన యాబై రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తామని అన్నారు. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల పరిస్థితులు మారాయి. థియేటర్స్కు ప్రేక్షకులు రావడం లేదు. థియేటర్స్ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ `వకీల్సాబ్`ను మే 7న విడుదల చేయాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.