తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఉన్న ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో నాన్ కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందించనున్నారు. ఈ దవాఖానను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం ప్రారంభించనున్నారు.
మొదట 50 పడకలతో సేవలు ప్రారంభించి, వారం రోజుల్లో దానిని 250 పడకలకు పెంచనున్నారు. దీంతో మరో వారం రోజుల్లో కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సాధారణ వైద్యసైవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.