కరోనా వైరస్ విజృంభణ సెకండ్ వేవ్లో మరింత పెరిగింది. శుక్రవారం కరోనా కారణంగా టాలీవుడ్లో ఓ విషాదం చోటు చేసుకుంది. శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనా వైరస్ వల్ల కన్నుమూశారు.
కొన్నిరోజుల ముందు ఆయన కొవిడ్ ప్రభావంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో టాలీవుడ్ షాక్కు గురైంది.
కుమార్ వట్టి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట. దర్శకుడు పరశురామ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. 2017లో ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా మారారు.