Home / MOVIES / నీతో మాట్లాడాలంటూ గదిలోకి లాక్కెళ్లి – ఎమ్మెస్ నారాయణపై నటి పద్మజయంతి సంచలన వ్యాఖ్యలు

నీతో మాట్లాడాలంటూ గదిలోకి లాక్కెళ్లి – ఎమ్మెస్ నారాయణపై నటి పద్మజయంతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్‌ నటి పద్మ జయంతి.. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణపై సంచలన కామెంట్స్‌ చేశారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ జయంతి.. అప్పటి విషయాల గురించి చెబుతూ.. కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో నటి పద్మ జయంతి మాట్లాడుతూ.. ”ఒకసారి సెట్స్‌లో నేను కూర్చుని ఉండగా.. వెనుక నుంచి వచ్చిన ఎమ్మెస్‌ నారాయణగారు.. నా చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లబోయారు. ఏంటి సార్‌ ఇది.. ఇవేం పనులు అని నేను అరుస్తున్నా.. వినకుండా.. నీతో మాట్లాడాలి రా.. అని లాగుతూనే ఉన్నారు. అప్పుడు నాకర్థమైంది.. ఆయన బాగా తాగి ఉన్నారని. ఆ మైకంలోనే నాపై అలా ప్రవర్తించారు.

అయితే నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన నుంచి విడిపించుకుని.. గట్టిగా ఆయన పీక పట్టుకున్నాను. నా నుంచి ఇలాంటిది ఊహించని ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ పరిగెత్తుకొచ్చి.. నా నుంచి ఆయనని విడిపించారు. దీనిపై నేను యూనియన్‌లో ఫిర్యాదు చేసినా.. నాకే నచ్చజెప్పారు తప్ప.. ఆయనని ఏం చేయలేదు. ఎందుకంటే.. అప్పటికే ఆయన పెద్ద కమెడియన్‌. ఇది జరిగాక చాలా కాలం నాకు అవకాశాలు కూడా రాకుండా చేశారు. చాలా ఇబ్బందులకు గురి చేశారు..” అని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంలో ఎంత నిజముందనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే.. ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాతో పాటు.. టాలీవుడ్‌లో కూడా హాట్‌ టాపిక్‌గా మారా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat